Saturday 25 July 2020

9. కంతి ధరించునపుడు జరిగిన మహిమ


                స్వామి సమాధి అయిన తర్వాత కొన్ని రోజులకు గడేకల్లు గ్రామములో ఉండే మఠపతి బసయ్య అను అతను, కంతి (బండల మధ్య ఖాళీని కానీ రంధ్రమును కానీ పూడ్చడానికి  వేసే పదార్థము) ధరించు ఆయనకు తోడుగా పని చేయుచుండెను. ఇతడు స్వామి సమాధికి ఒక రంధ్రము ఉన్నది.
ఆ రంద్రమునకు తన హస్తమును పెట్టి చూడగా సమాధిలో నుండి చల్లని మారుతము చేతికి తాకడం అతను గమనించాడు. ఇతను ఈ సమాధిలో ఏమున్నదో చూడాలన్న కోరికతో ఒక పొడవయిన కర్రను తీసుకొని సమాధిరంధ్రములో పెట్టి సమాధి నాలుగు మూలలా కర్రతో తాకుతూ, ఒకటి రెండు మూలలకు కర్రను తగిలించాడో లేదో అంతలోనే సమాధి నుండి భగ్గునమి మంట పుట్టి, ఈ కర్ర జొప్పించిన అతని దేహమాద్యంతము కాలి, బొబ్బలు పుట్టి, దేహమంతా మంటలు అధికమై చాలా బాధతో అరవసాగెను. ఆ అరుపుకు నలుగురూ వచ్చి, జరిగిన విషయం విషయం తెలుసుకొని “మనము చేయడానికి ఏమున్నది. ఇక ఇతనిని ఆ భీమలింగుడే కాపాడాలి గానీ, వేరెవ్వరి వల్లా కాదు” అనుకుని పెద్దలందరూ స్వామిని వేడుకొని కాలిన బసయ్యను స్వామి సమాధి ముందర పరుండబెట్టి, స్వామి పైనే భారము వేసారు. ఆ కాలిన బసయ్య స్వామిని “స్వామీ ‌అజ్ఞానముతో నేను చేసిన తప్పును మన్నించండి. ఈ బాధను భరించలేకుండా ఉన్నాను. నన్ను కాపాడండి “ అని ప్రార్థిస్తూ సొమ్మసిల్లిపోయాడు. నిద్రలో స్వామి సాక్షాత్కరించి బెత్తముతో మూడుసార్లు తట్టి ఇకనైనా బుద్ధితో మెలగమని” చెప్పి అంతర్థానమయారు.

స్వామి బెత్తము తగలగానే స్వామీ అని గట్టిగా కలవరించుకున్నాడు. అప్పుడు చుట్టు ప్రక్కలవారు ఏమైందని ప్రశ్నించగా, తనకు కలలో జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పటికే అతనికి సగము బాధ తగ్గిపోయింది. సూర్యోదయము తర్వాత బసప్ప మామూలుగా నిద్రలేచి జరిగిన సంఘటన తలచుకొని స్వామివారి ఆగ్రహమూ, అనుగ్రహము ఎలా ఉంటాయో తెలుసుకున్నవాడై, స్వామికి కాయా కర్పూరాలను తెచ్చి, పూజలు చేసి ఇంటికి వెళ్ళెను.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...