Saturday 25 July 2020

14. కరడిగుడ్డం మంగమ్మ అవధూత


               కరడిగట్టు మంగమ్మవ్వ జన్మతః అవధూత. యల్లార్తికి ఇవతల కరడిగుట్ట అనే గ్రామము ఉంది. అక్కడ ఈమె భవ్య మందిరము వెలసింది. పెళ్ళయి పసుపు బట్టలతో గడేకల్లు భీమలింగేశ్వరుని ఆలయ శిఖరాలను చూడ్డానికి వచ్చింది. 
                                                 
తలుపు వద్ద నుండి భీమలింగున్ని దర్శించింది. స్వామిని గురువుగా ఆరాదించింది. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కరడిగుట్టలో ఒక బండమీద కూర్చుంది. దాన్ని తపస్సుగుండు అంటారు. 12 సంవత్సరాలు స్వామి ద్యానంలో ఉండిపోయింది. వంటిమీద బట్టలు చిరిగిపోయినామారుబట్ట తొడగలేదు. దిగంబరంగానే ఉండిపోయింది. ఆమె పలికిన పలుకులన్నీ అమోఘవాక్కులే. గట్టు మీద కూర్చొని వ్యాపారము చేసేవారికి గానీవ్యాజ్యం పోయేవారికి గానీ, “అవుతుందిరో” అంటే బాగయ్యేది. కాదురో” అంటే అంతే. అవ్వదగ్గరకు అనేకమంది తినడానికి మంచి మంచి పదార్థాలను తెచ్చెవారు. ఒకసారి అన్నిటినీ వదిలి అంత్యజుడు తెచ్చిన ఎండిపోయిన రొట్టె ముక్కను బ్రహ్మానందంగా తినింది. అతని పంట పండి ధనిక శ్రేణికి చేరుకున్నాడు. ప్రతి ఏడాది మంగమ్మవ్వ జాతరరోజున ఉదయానే  పసుపుకుంకుమవిబూధిపండ్లుహారాలునెయ్యినిమ్మపండ్లువివిధ రకాల పండ్లు మొదలయిన పూజా సామాగ్రిని తెచ్చి అవ్వ గురువైన  భీమలింగేశ్వరుని జీవసమాధి పూజ జరిపించిజీవసమాధి పూజా తీర్థమునఅంగారుసామి జీవసమాధిపై ఉంచిన పూలుపండ్లునిమ్మకాయలుపసుపు కుంకుమ మొదలగు వాటిని కరడిగుట్టకు తీసుకెళ్ళి వాటితో అవ్వరథోత్సవవేడుకలు ప్రారంభమవుతాయి. 

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...