కరడిగట్టు మంగమ్మవ్వ జన్మతః
అవధూత. యల్లార్తికి ఇవతల కరడిగుట్ట అనే గ్రామము ఉంది. అక్కడ ఈమె భవ్య మందిరము
వెలసింది. పెళ్ళయి పసుపు బట్టలతో గడేకల్లు భీమలింగేశ్వరుని ఆలయ శిఖరాలను
చూడ్డానికి వచ్చింది.
తలుపు వద్ద నుండి భీమలింగున్ని దర్శించింది. స్వామిని గురువుగా ఆరాదించింది. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కరడిగుట్టలో ఒక బండమీద కూర్చుంది. దాన్ని తపస్సుగుండు అంటారు. 12 సంవత్సరాలు స్వామి ద్యానంలో ఉండిపోయింది. వంటిమీద బట్టలు చిరిగిపోయినా, మారుబట్ట తొడగలేదు. దిగంబరంగానే ఉండిపోయింది. ఆమె పలికిన పలుకులన్నీ అమోఘవాక్కులే. గట్టు మీద కూర్చొని వ్యాపారము చేసేవారికి గానీ, వ్యాజ్యం పోయేవారికి గానీ, “అవుతుందిరో” అంటే బాగయ్యేది. “కాదురో” అంటే అంతే. అవ్వదగ్గరకు అనేకమంది తినడానికి మంచి మంచి పదార్థాలను తెచ్చెవారు. ఒకసారి అన్నిటినీ వదిలి అంత్యజుడు తెచ్చిన ఎండిపోయిన రొట్టె ముక్కను బ్రహ్మానందంగా తినింది. అతని పంట పండి ధనిక శ్రేణికి చేరుకున్నాడు. ప్రతి ఏడాది మంగమ్మవ్వ జాతరరోజున ఉదయానే పసుపు, కుంకుమ, విబూధిపండ్లు, హారాలు, నెయ్యి, నిమ్మపండ్లు, వివిధ రకాల పండ్లు మొదలయిన పూజా సామాగ్రిని తెచ్చి అవ్వ గురువైన భీమలింగేశ్వరుని జీవసమాధి పూజ జరిపించి, జీవసమాధి పూజా తీర్థమున, అంగారు, సామి జీవసమాధిపై ఉంచిన పూలు, పండ్లు, నిమ్మకాయలు, పసుపు కుంకుమ మొదలగు వాటిని కరడిగుట్టకు తీసుకెళ్ళి వాటితో అవ్వరథోత్సవవేడుకలు ప్రారంభమవుతాయి.
No comments:
Post a Comment