11వ శతాబ్దం, ప్రభవనామ సంవత్సరం, శ్రావణ మాసం, శుక్ల పంచమి, శుక్రవారము నాడు తూర్పుగోదావరి జిల్లాలో వేములవాడ అనే గ్రామాన, శ్రీ సోమనాథమాత్యుడు, శ్రీమతి మాచమ్మ దంపతులకు ద్రాక్షరామ భీమేశ్వరుడి అంశతో పుట్టిన బాలుడు, తాను పుట్టకమునుపే తండ్రిని పోగొట్టుకుని, తల్లినే, తండ్రిగా, గురువుగా, ప్రత్యక్షదైవంగా భావించి, అతి పిన్నవయసులోనే సకలవిద్యలను అవపోసన పట్టిన భీమన్న, తదనంతర కాలంలో వేములవాడ భీమకవిగా విశ్వఖ్యాతిని పోందారు. వీటికి సంబందించిన విషయాన్ని మనం చదివాం.
ఒకసారి వేములవాడ గ్రామంలోని బ్రహ్మణుల ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు తనకు భొజనం వడ్డించకుండా అవమాన పరిచినప్పుడు, వారికిబుద్ధి చెప్పడానికి “అన్నం అంత సున్నం అవ్వని, అప్పడాలు కప్పలుగా మారని” చెప్పిన మాటలతో మొదలైన భీమకవి మహత్యాల ప్రస్థానం భీమలింగేశ్వరుడిగా నేటికి అప్రతితహితంగా కోనసాగుతుంది.
తండ్రిలేని వాడని ఊరంతా ఎగతాళి చెస్తున్నా ఏనాడు భీమన్న భాదపడలేదు కాని నా తండ్రి మరణాంతరం పుట్టినందుకే కదా నా తల్లిని ఊరి నుంచి వెలేసారు, శివభక్తురాలైన తన తల్లికి ఏందుకు ఈ అవమానం అని మధనపడి తన తల్లి వద్దకు వెళ్ళి “అమ్మా నేను నా తండ్రి మరణాంతరం పుట్టినవాడిని అని అందరూ ఏగతాళి చెస్తున్నారు, శివ భక్తురాలైన నీవే దీనికి సమాధానం చెప్పాలి” అని తల్లిని ప్రాధేయపడగా అప్పుడు మాచమ్మ, భీమన్నతో ఇలా చెప్పెను “భీమన్నా దీనికి సమాధనం ఆ దక్షారామ భీమేశ్వరుడు మాత్రమే చెప్పగలడు, వెళ్ళి అడుగు అని ” చెప్పిన వెంటనె దక్షారామమునకు వెళ్ళి భీమేశ్వరుడిని ప్రార్థించి, ప్రసన్నం చేసుకుని, తన జన్మవృత్తాంత్తాన్ని, ఆవశ్యకతను తెలుసుకుని మరలా వేములవాడకు వెళ్ళి, తన తల్లి పాదాలకు నమస్కరించి, జరిగినదంతా చెప్పి, తన జన్మ ఆవశ్యకతను తల్లికి వివరించి, ఒప్పించి, భీమకవిగా సూమారు 400 సంవత్సరాలు(11వ శతాబ్దం – 14వ శతాబ్దం) రాజమహేంద్రవరం, నెల్లూరు, పావులూరు, తిరుచునాపల్లి, కావేరీతీర నగరము, చోళరాజ్యము, సామర్లకోట, , కళింగ, కాకతీయరాజ్యము, కొండపల్లి, పంచపాడు, యర్రగడ్డపాడు, హేలాపురం, వేలూరు, పెద వేంగిపట్టణం, పిఠాపురం, సెజ్జ నగరం, వంగదేశం, కోరుమిల్లి, గుడిమెట్ట, భీమవరం ఇలా వేములవాడ భీమకవిగా దేశాటం చెస్తూ, వివిధ రాజ్యాలు తిరుగుతూ, ప్రజాపరిపాలన, ఆధ్యాత్మిక చైతన్యం పట్ల ప్రభువులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కవిగా భూత, భవిష్యత్, వర్తమాన కాలదులను ఆక్షరాలలో బందించి, తెలుగు, సంస్కృత భాషలకు పట్టం కట్టి, రచనలో తనకు ఏవరు సాటిరారని నిరూపించి, జగత్ ఖ్యాతిని పోంది, కవిరాక్షసుడిగా బిరుదాంకితుడైన తరువాత తన జన్మ ఆవశ్యకతప్రకారము, భీమలింగేశ్వరుడిగా అవతరించి సూమారు 300 సంవత్సరాలు (15వ శతాబ్దం-17వ శతాబ్దం) ఈ భూ మండలంపై నడియాడి చివరగా అనంతపురం జిల్లా, గడేకల్లు గ్రామంలో జీవసమాధి అయ్యారు.
వేములవాడ భీమకవి పేరిట వ్రాసిన పుస్తకాల్లో కేవలం కవిగా మాత్రమే, అందునా కోన్ని అంశాలనే పరిగణనలోనికి తీసుకున్నారు. వేములవాడ భీమకవి ద్వితియార్థంలో శ్రీ భీమలింగేశ్వరస్వామిగా అవతరించడంతో పాటు దేశాటంలో భాగంగా పలుప్రాంతాలలో తన మహిమలను చూపిస్తూ, భక్తుల కోరికలను నెరవెరుస్తూ…నమ్మి కొలిచిన వారి పాలిట కొంగుబంగారమై నిత్యపూజలను అందుకుంటున్నారు….
పలు ప్రాంతాలలో కొంత కాలము నివసిస్తూ భక్తులలో తన ఆధ్యాత్మికబోధనలతో, జ్ఞానబోధనలతో, మూఢనమ్మకాల పట్ల స్వామివారు గట్టిగా వ్యతిరేకించి, ఇవ్వన్నీ కేవలం మానవకల్పితాలు అని చెబుతూ, ఇక్కడ పుట్టుక-చావు మధ్యలో అంతా మిథ్య అంటూ వాస్తవికతను వివరిస్తూ భక్తులలో చైతన్యాన్ని తీసుకొచ్చేవారు. స్వామి వారు కుర్చున్న ప్రాంతంలోనే లింగాణ్ణి ప్రతిష్టించి, ఈ లింగాన్ని పూజించండి, సర్వకాల, సర్వావస్థలందు నేను ఈ లింగము నందునె కోలువై ఉంటాను అని చెప్పి ముందుకుసాగెవారు.
అనంతపురము జిల్లా పెదపప్పూరు ప్రాంతాన అశ్వర్థభీమలింగేశ్వరస్వామి దేవాలయప్రాంతమున, కర్నూలు పట్టణంలో తుంగబద్ర నదీతీరాన భీమలింగేశ్వరస్వామి చాలా కాలము తపస్సు చేసినట్లు, పూర్వము ఇక్కడ స్వామి వారికి దేవాలయాలున్నట్లు, తదనంతరకాలంలో కాలగర్భంలో కలిసిపోయినట్లు చారిత్రక ఆధారలను బట్టి తెలుస్తుంది.
No comments:
Post a Comment