Saturday 25 July 2020

7. గడేకల్లు గ్రామములో సచ్చిన ఎనుమును బ్రతికించడం


గడేకల్లు గ్రామము నందు శివాచార మతస్థులు(లింగాయతులు), “దివాణము వారు” అను వారు చాలా దైవభక్తి కలవారు. వీరి ఇంట్లో ఎప్పటికి పాడి తప్పక ఉండును. ఈ ఇంట ఒక పుణ్యాత్మురాలు “దివాణం బసమ్మ” అను ఆమె ఉండేది. స్వామివారు ఆ గ్రామానికి వచ్చినప్పటి నుండీ రోజూ ఎనుము పాలు ఇచ్చుచుండెను.
ఒక దినం స్వామివారు పాల కొరకు వచ్చేలోపు ఎనుము పాలు పిండాలని చూడగా ఎనుము పాలు ఇవ్వకపోయినది. తర్వాత స్వామి వచ్చి పాలు త్రాగడానికి ఇవ్వమని అడుగగా ఆమె స్వామీ ఈ దినమున ఎనుముకు ఏమయ్యిందో పాలు ఇవ్వలేదు. స్వామివారు ఎందుకు ఇవ్వలేదు అని బసమ్మను అడుగగా “ ఆమె ఎందుకో దానికి ఏం పొయ్యే కాలము దాపురించిందో ఏమో?. ఇవ్వలేదు” అని చెప్పింది. అందుకు స్వామి వారు “నీ ఎనుముకు పొయ్యే కాలము వచ్చిందా? పోనీలెమ్మని” వెళ్ళిపోయెను.
స్వామి వెళ్ళిపోగానే గాటికి కట్టిన ఆ ఎనుము తనంతట తానే పడి చనిపోయింది. అంతటా ఆమె ఇది ఏమి అన్యాయమూ, ఈ స్వామి నీ ఎనుము పోనీలెమ్మని వెళ్ళిపోయిన వెంటనే ఎనుము సచ్చి పడిందని స్వామివారి కోసము వెతక సాగింది. ఎక్కడ చూసినా ఆయన కనపడక పోవడంతో ఆ సచ్చిన ఎనుమును గారె వాడికి ఇచ్చివేసింది. అప్పుడు సాయంత్రము అవ్వడంతో ఆ గారెవాడు ఆ ఎనుమును ఏమి చెయడానికి వీలులేక ఒక చోట భద్రంగా ఉంచినాడు. మరుసటి రోజున వాడు దానిని కోసి భాగముల ప్రకారము కుప్పలు వేయగా, అదే సమయమున అదే ఇంటికి పోయి పాలు ఇవ్వమని అడుగగా ఆమె నిన్నటిరోజున స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం చెప్పింది. స్వామి వారు ఆమెను ఎనుమును చూపించమని, బ్రతికిస్తానని చెప్పినా, ఇప్పటికే గారెవాడు దానిని కోసి కుప్పలుగా వేసి ఉంటాడు. ఇక లాభం లేదని లోపలికి వెళ్ళిపోయింది.
స్వామివారు గారెవాడి ఇంటి వద్దకు వెళ్ళి చూడగా అప్పటికే వాడు కుప్పలుగా కోసి భాగములు వేసి ఉండడం చూసి ఆ కుప్పలనూ, దాని చర్మం, కొమ్ములూ, గిట్టలనూ ఒక చోట వేయించి స్వామివారు తన బెత్తముతో స్పృశించగానే ఎనుము యధాప్రకారము లేచి వచ్చింది. ఆమె ఆ ఎనుమును చూసి గారె వాడిని విచారించగా “ జరిగిన వృత్తాంతమునంతా చెప్పాడు.

నాటినుండీ ఆ ఇంటి వారు కూడా స్వామివారికి భక్తులై నడుచుకొనేవారు. 

స్వామి వారి మహిమలను గడేకల్లు గ్రామస్థులే కాక, చుట్టుప్రక్కల ప్రాంతముల వారు, బళ్ళారి, గుంతకల్లు, వాటి చుట్టూ ఉన్న పల్లెలు, బెల్డోణ, ఏరూరు, పెంచులపాడు, విడపనకల్లు,, కడదరపెంచి, గుమ్మనూరు, తోరణగల్లు మొదలైన ప్రాంతాలలో చెప్పుకొవడంతో, స్వామివారిని చూసెందుకు తండోపతండాలుగా వచ్చెవారు. తన వద్దకు వచ్చిన ప్రతి భక్తునకు, భక్తురాలికి, చిరునవ్వుతో సమస్యలని పరిష్కరించేవారు. అలా స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు స్వామి వారిని ఇలవేల్పుగా కొల్చుకునెవారు.


అయితే కొందరు పెద్దలు ఈ సంఘటన చాబాల గ్రామములో సంజమ్మ ఇంటజరిగిందని, స్వామి వారి మహిమ చూసిన సంజమ్మ సంసారబంధములను వదులుకొని గురుసేవ నిమిత్తo స్వామివారిని అనుసరించిందని, ఎన్నో పరీక్షల అనంతరం స్వామి వారు సంజమ్మ శిష్యురాలిగా అంగీకరించారని మరో కథనము.





No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...