Saturday 22 August 2020

శ్రీ భూవరహస్వామి దేవాలయం, కల్లహల్లి,కర్ణాటక

మెల్కోటెకి 42 కిలోమీటర్ల దూరంలో మాండ్య జిల్లాలోని కల్హల్లి అనే చిన్న గ్రామంలో శ్రీ భూవరహస్వామి దేవాలయం హేమవతి నది ఒడ్డున ఉంది. విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ స్వామి విగ్రహం 18 అడుగుల ఎత్తు మరియు బూడిద రాయితో తయారు చేయబడింది. వరాహ స్వామి కుడిచేతిలో సుదర్శన్చక్రం, ఎడమతొడ మీద భూదేవీ ఆసీనులై కూర్చొని దర్శనమిస్తున్నది. 

ఈ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నదిలో ఈత కొట్టడం,  పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉండదు. వర్షా కాలంలో ఈ నదిలోని నీరు ఆలయం గోడకు చేరుకుంటుంది. ఏప్రిల్ మరియు మేలో నీరు తగ్గిన తరువాత వార్షిక ఉత్సవాలు జరుగుతాయి.

భూవరాహస్వామి ఆలయం 2500 సంవత్సరాలకు పైగా ఉంది. స్థలపురాణం ప్రకారం, ఈ ఆలయంలో గౌతమ మహర్షి తపస్సు చేశాడని చెపుతారు. ఈ దేవాలయానికి రాజ వీర్ బాలాల గురించి ఒక పురాణ కథ ఉంది. వేట కోసం రాజు అడవికి వెళ్ళిన సమయంలో విశ్రాంతి కొరకు ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో అక్కడ ఒక వింత దృశ్యాన్ని గమనించాడు. ఒక కుక్క చిన్న కుందేలును తరుముకుని రావడం చూశాడు. మరి కొద్ది సేపటికి కుందేలు కుక్కను తరుముకునిపోవడం  గమనించాడు.

అప్పుడు ఆ రాజు ఈ ప్రదేశంలో కొన్ని మాంత్రిక శక్తులను కలిగి ఉందని విశ్వసించాడు మరియు ఈ ప్రదేశంలో 16 అడుగుల లోతు తవ్వి చూడగా  అక్కడ వరాహస్వామి విగ్రహం దాగి ఉండటాన్ని కనుగొన్నాడు. 

ఈ సంఘటన తరువాత, ఈ రాజు అక్కడ వరహాస్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతీ రోజు పూజలు చేయడం ప్రారంభించాడు.




No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...