Showing posts with label గడేకల్లు శ్రీభీమలింగేశ్వర స్వామి/వేములవాడ భీమకవి. Show all posts
Showing posts with label గడేకల్లు శ్రీభీమలింగేశ్వర స్వామి/వేములవాడ భీమకవి. Show all posts

Saturday 25 July 2020

2. అంబమ్మ మఠంలో నిత్యపూజలతో మహిమాన్వితమైన దైవంగా వెలుగోందుతున్న శ్రీ భీమలింగేశ్వరస్వామి



అంబమ్మ మఠంలో నిత్యపూజలతో మహిమాన్వితమైన దైవంగా వెలుగోందుతున్న శ్రీ భీమలింగేశ్వరస్వామి వారు.




కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా, సింధనూరు తాలుక, తుంగబద్ర నదీ తీరాన గల శ్రీ అంబాదేవి మఠం వద్ద కూడా కొంతకాలము నివసించారు. ఇక్కడ స్వామి వారికి ఒక దేవాలయము కూడా నిర్మించారు.  అక్కడి ప్రజలు భీమలింగేశ్వరుడు ధ్యాననిమగ్నుడై కుర్చునే చోటు, భక్తులకు తన భోదనలు అందించే చోటున దేవాలయాన్ని నిర్మించి ఒక లింగాన్ని ప్రతిష్టించి శ్రీ భీమలింగేశ్వరస్వామిగా కొలుస్తున్నారు. ఇప్పటికీ ఆ దేవాలయంలో స్వామివారికి నిత్యపూజలు జరుగుతున్నాయి. లింగాయితులు ఆ దేవాలయానికి పూజాదివ్యవహారాలను చూసుకుంటున్నారు. ఈ ప్రాంతమున భీమలింగేశ్వరస్వామికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. భీమలింగేశ్వరస్వామి దేవాలయమును దర్శించినపుడు అక్కడివారు కొందరు స్వామి గురించి ఈవిధముగా చెప్పారు. అంబమ్మ దేవాలయంలో తిరునాళ్ళు జరుగుతున్న రోజుల్లో స్వామివారు అక్కడకు వచ్చారు. ఈ తిరునాళ్ళు ప్రతి ఏటా పుష్యమాసపౌర్ణమినాడు ఎంతో వైభవంగా జరుగుతాయి.
అంబమ్మ ఉత్సవాన్ని పురస్కరించుకుని పండితులు కొందరు పురాణకథలూ, ఉపన్యాసాలు, జ్ఞానభోదనలు చేస్తున్నారు. ఆ సమయంలో స్వామి వారు అక్కడే ఉన్నారు. అక్కడ చెబుతున్న పండితులలో కొంతమందికి పురాణాల పట్ల, శాస్త్రము పట్ల మరియు సంస్కృతభాషా పట్ల సరైన అవగాహన లేక కల్పిత కథలు చెబుతూ..పైగా మేము వైధిక శాస్త్రలలో నిశ్ణాతులమని పండితులలో కొందరు చెప్పుకుంటూ అసత్యబోధనలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలుగా కల్లబొల్లి మాటలను చెబుతున్నారు. ఇది  స్వామి వారికి నచ్చలేదు. స్వామివారు వారి బోధనలను తప్పు పట్టారు. వారిని ప్రశ్నించారు. నలుగురినీ ఇలా తప్పుదోవ పట్టించవద్దని హితువు పలికాడు.
అసత్యభోధనలు చేస్తున్న పండితులకు, తోడుగా అక్కడే ఉన్న మిగతా పండితులంతా జతకలిసి గుంపుగా చేరి ఈ ముసలతను ఇక్కడే ఉంటే తమ ఉనికికే ప్రమాదమని భయపడ్డారు. మరుసటి రోజు ఉదయం వారు స్వామిని పిలిచి “ఎవరవు నువ్వు? ఎక్కడినుంచి వచ్చావు?” అని అడిగారు. “నేను దక్షారామభీమేశ్వరుని వరపుత్రుడను వేములవాడ భీమలింగేశ్వరుడను“ అని బదులిచ్చారు. ఏదో విధంగా అతన్ని ఇక్కడి నుంచీ పంపివేయాలన్న ఉద్దేశంతో పండితులంతా కలిసి “మేము మీకు ఒక పరీక్ష పెట్టదలచాము. అందులో నెగ్గితేనే నీకు ఇక్కడ స్థానము, ఓడిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీకు సమ్మతమేనా?” అని అడిగారు. స్వామివారు “అందుకు నాకు సమ్మతమే. కానీ నేను నెగ్గిన తరువాత మీ అందరికీ కూడా ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గితేనే మీకు ఇక్కడ స్థానం” అని షరతు పెట్టారు.

                మరుసటిరోజు జనులందరి మధ్య వారు తమ శక్తిని ప్రదర్శించి స్వామివారు తన పాండిత్యప్రకర్శణాన్ని పరీక్షించారు. సకలశాస్త్రపారంగతుడైన స్వామి సునాయాసంగా నెగ్గాడు. ఇప్పుడు స్వామి వారి వంతు. స్వామి అందరినీ అక్కడ ఉన్న బావి దగ్గరకు పిలిచి ప్రజలతో కొన్ని చిన్న చిన్న రాళ్ళను తెప్పించారు. తనతోపాటు పండితులకు ఒక్కొక్క రాయిని ఇవ్వమని చెప్పారు. అందరి సమక్షంలో చూపించి వారివారి రాళ్ళకు గుర్తులు పెట్టి, అందరికీ చూపుతూ ఆ రాయిని ఒక్కొక్కరుగా ఈ బావిలోకి వేసెదము. ఎవరి రాయి అయితే నీటిపై తేలుతుందో వారికి మాత్రమే ఇక్కడ స్థానమని చెప్పారు. అక్కడి ప్రజలు, పెద్దలు అందుకు సమ్మతించిపై చెప్పిన ప్రకారము జరిపించారు. అలా బావిలో వేసిన రాళ్ళలో స్వామివారు వేసిన రాయి మాత్రము నీటిపై తేలినది. ఈ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇతడు సాధారణ మానవుడు కాదని కొనియాడారు. ఆ ఊరివారు రోజు స్వామివారిని దర్శించేవారు, తమ తమ కష్టాలను స్వామివారితో విన్నవించుకొనేవారు. వారి సమస్యలకు పరిష్కారాలు దొరికేవి. స్వామివారిని ఇలవేలుపుగా, ప్రత్యక్షదైవంగా కొలిచేవారు. స్వామివారు ధ్యానంలో కుర్చొనేచోట ఒక దేవాలయమును నిర్మించారు. ఈ దేవాలయానికి తూర్పుముఖాన ఒక కిలోమీటరు దూరాన కొండను అనుకొని శ్రీబాగళాంబదేవి ఆలయము ఉన్నది. పడమర వైపున తుంగభద్రనది ఉన్నది.

Friday 24 July 2020

శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి (భీమకవి)

ధర్న సంస్తాపనాయ సంభవామి యుగే యుగే||

            నిరాకారుడయిన పరమాత్మ సాకారుడై అనేక అవతారములెత్తిన కర్మభూమి మన భారతదేశము. ధర్మసంస్తాపనార్థం అవసరమైన ప్రతిసారీ తానే ఈ భూమిపై అవతరిస్తానని గీతలో చెప్పిన విధంగా భగవంతుడు జనులకు దిశానిర్దేశం చేసి, సన్మార్గంలో, భక్తిమార్గంలో నడిపించడానికి ఎందరో యోగులు, ఋషులు, అవధూతలు, గురువుల రూపంలో అవతరించిన వేదభూమి మన భారతదేశము.
          అటువంటి అవతారపురుషులలో అనంతపురము జిల్లా, విడపనకల్లు మండలము నందు గడేకల్లు గ్రామాన వెలసిన శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అగ్రగణ్యులు. సాక్షాత్తు వేదాలకు మూలమైన పరమేశ్వరుని అంశతోతూర్పు గోదావరి జిల్లాలోని వేములవాడలో జన్మించినవారు, అఖిలలోకపాలకాను సుశక్తి సంపన్నులు“శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి”.
నిత్యబ్రహ్మచారిగా ఈయనతన జీవితం తొలిదశలోకవీశ్వరునిగా “శ్రీ వేములవాడ భీమకవిగా” ప్రాశస్త్యం గడించారు. మలిదశలో దైవాంశసంభూతులుగా భక్తకోటి ఆరాధ్య దైవంగా గడేకల్లున “శ్రీభీమలింగేశ్వరస్వామి”గా నిలిచారు.
భీమకవిగా, ద్రాక్షారామ భీమేశ్వరుడి వరప్రసాదంగా అమోఘకవితా శక్తిని కలిగితన పదవాక్కుతోటి అక్షరాలను రెక్కలుగా మార్చివిశ్వవిహారం చేసిన కవియోగి. వాగ్బణమువాక్ఛాతుర్యము కలిగినతన అమోఘవాక్కులతో పాదాశ్రితులకుఆరాధకులకు ఆశీర్వచనాలనువరాలను గుప్పించే నిత్యశుభకరుడుఅఖిలైశ్వర్యప్రదాయకుడు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి.ఉద్దండ కవితావాగ్ధురీణుడైఎందరో ప్రభువులనురాజ్యాధినేతలను తన మృదుమధురపద పద్యపరిమళాలతో రంజింపచేస్తూవారికి కొండంత అండగా నిలిచినిరంతర సత్యాన్వేషణ విచక్షణుడైపరిపాలనాదక్షతలో వారికి మార్గోపదేశం చేసిన రాజగురువుపరిపాలక ప్రావీణదర్శుడు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి.
          

“ఆగతానాగతవేదియు సత్యాన్వేశణ విచక్షనుండును,ఉద్ధండకవితావాగ్ధురీనుండును సకలభూప సభాంతరాళ భీమవాక్య పరిగుంబ్య మాన గుణుండును, సకలదేశవిద్వత్సభా సంమోదశాస్త్రార్థసార కౌశలుండునూ, ఉదారస్వభావుండును, నిగ్రహానుగ్రహసుశక్తిసంపన్నుండును, నిఖిలైశ్వర్యప్రధానాశీర్వాదామోఘవాక్భవుండును, నిరంతర జపతప స్వాధ్యాయ కర్మానుష్ఠాన చరితుండును, నిష్టాగరిష్టుండును, నిర్మల పరిపూర్ణ మానసోదారుండును, నిఖిలాంధ్రదేశ సంచారిత సద్యశోధురంధరుండును, నగు వేములవాడ భీమనామాత్యకవిశేఖరుండు సఖలాంధ్ర జనహృదయాంతరాళంబులనిత్య మంగలప్రదుండగుచు నిరంతర సౌఖ్యప్రధాయియగుచు నితరేతరసమాకర్ష్యమాన సౌఖ్యసంగనితోత్తుంగ సంతతానందవివర్ధమానుండగుచు నిఖిలసంపత్కరుండగుచు, నిర్ణిద్రమాన శోభాకరుండగుచు నిరంతరంబ్రకాశించుచుండునుగాక”



భీమకవిని అందరు నిగ్రహానుగ్రహ సమర్థుడని పిలుస్తారు. ఇదే విషయాన్ని మలకపల్లి పెదశేషయ్య గారు “ఉద్దండకవి వేములవాడ భీమకవి చరిత్ర”లో  ఇలా వివరించారు.

          సీ       తిట్టినతిట్టు మొత్తిన పిడ్గు కై వడి
                           నతి భయంకరముగా నడచి కొట్టు
                   కరుణించి దీవింపఁ గైలాసపతి మెచ్చి
                           యిచ్చిన వరముగా నెసక మెసగు
                   శాపంబు వెట్టిన సద్యోవినిర్భిన్న
                           భక్ష్యభాండమురీతి బయలఁబడును
                   క్రమ్మఱించిన శాప కాండంబు లెల్లను
                           వడిఁబటా పంచలై యడగిపోవు
                   నిగ్రహానుగ్రహ విలాస నియతమాన
                           మానసోల్లాసవర్తి సంపత్ప్రపూర్తి
                   ఘనుడు వేములవాడ భీమన కవీంద్ర
                   చరిత మానందదాయియై వరలుఁగాత

భావము: తిట్టిన తిట్టు, గట్టిగా కొట్టే పిడుగు కన్నా వేగముగా చాలా భయంకరముగా వచ్చి తాకుతుంది. అదే కరుణించి దీవించినపుడు, స్వయానా కైలాసపతైన ఆ పరమేశ్వరుడే ప్రసన్నుడై ఇచ్చిన విధంగా వరాలను గుప్పిస్తారు. శాపము పెట్టిన తక్షణం వికటించిన ఆహారములాగా తీవ్రప్రభావము చూపిస్తూ బయటపడుతుంది. ఉపసంహరించినపుడు, శాపప్రభావమంతా సమూలంగా, వేగంగా పటాపంచలై నశించిపోతుంది.నిరంతరము నిగ్రహ, అనుగ్రహములతో తనలీలలను చూపుతూ, ఎల్లపుడూ ఆనందమైనదాయకమైన మనసుతో ప్రకాశించేవాడు. సంపదలోసగేవాడు. గొప్పవాడు అయిన వేములవాడ భీమకవీంద్రుని చరిత్ర అందరికీ ఆనందమును ప్రసాదిస్తూ ప్రకాశించును గాక!





ఇంతటి గొప్ప మహోన్నతశక్తిభూషణుడు, మహోజ్వలచరితుడి చాటుపద్యాల తేటతెలుగు తీయదనాన్ని నలుగురికీ అందచేయాలని ఆకాంక్షిస్తూ...శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం,, 2017




జన్మ వృత్తాంతము



జన్మ వృత్తాంతము

                తూర్పుగోదావరి జిల్లాలోని దక్షారామమునకు 12 కిలోమీటర్ల దూరాన వేములవాడ అనే గ్రామము ఉంది. గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడుండెను. ఎంతకాలానికీ ఇతనికి సంతానము కలుగలేదు. సంతానము కోసం ఇతను ఐదుగురిని  పెళ్ళాడాడు. శివభక్తిపరాయణుడై యజ్ఞయాగాలను చేస్తూ, ఎన్నో విధాలుగా పరమేశ్వరున్ని ఆరాధించాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. అయినా పుత్రలేమి బాధ మాత్రం తప్పలేదు ఇతనికి. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాటిరాత్రి పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి నీ మరణం తర్వాత నీకు పుత్రుడు కలుగుతాడు. అతని వల్ల నీకు పుణ్యలోకసిద్ధి కలుగుతుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి దిగులు మానేసి, సంతోషంగా కాలం గడిపి  మరణించాడు. ఇతని ఐదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. అమాయకురాలు. నిష్కల్మషమైన మనసు కలది, భర్తలాగా పరమేశ్వరుని మీద అపారమైన భక్తి కలది.


                భర్త మరణము తర్వాత ఒంటరి జీవితము అనుభవిస్తున్న మాచెమ్మ తన సవతులతో పాటి ఒకనాడు భీమేశ్వరున్ని దర్శించడానికి ద్రాక్షారామము వెళ్ళింది. దక్షారామములో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న రోజులవి. అశేషభక్తకోటి అంతా గోదావరీ స్నానము చేసి భీమేశ్వరుని దివ్యసుందరమూర్తిని దర్శించి, తమతమ కోరికలను విన్నవించుకోసాగారు. పుత్రులు లేనివారు సంతానం కోరుతూ పూజలు చేయించసాగారు. మాచెమ్మ కూడా గోదావరీ స్నానమాచరించి భీమేశ్వరున్ని దర్శించింది. నిర్మలమైన మనసుతో తనకూ ఒక సుపుత్రుడను అనుగ్రహించమని ప్రార్థించింది. అది విని  తనతో పాటి వచ్చిన యువతులందరు  ఫక్కున నవ్వి హేళన చేశారు, కానీ తాను మాత్రం సంతానానికి మీరొక్కరేనా అర్హులు. నేను అర్హురాలిని కానా? దయాసాగరుడైన భీమేశ్వరుడు అందరినీ సమానముగానే చూస్తాడు గానీ, ఒకరింట సున్నమును, మరొకరింట వెన్నను పెట్టడు గదామీ అందరికీ పుత్రుడను అనుగ్రహించి నాకు మాత్రం అనుగ్రహించకపోడు కదా!” అని బదులిచ్చి  వెళ్ళిపోయింది.


            అలా కోరిన యువతులందరికీ భీమేశ్వరుడు సంతానప్రాప్తి కల్గించాడో లేదో కానీ, సోమనాథామాత్యుని స్వప్నాన్ని నిజంచేస్తూ మాచెమ్మకు ఒక సుపుత్రుడిని అనుగ్రహించాడు. ఒకనాడు మాచెమ్మ నిదురలో ఉన్నప్పుడు మిరమిట్లు గొలిపే మహాజ్యోతి ఒకటి తన  కడుపున ప్రవేశించినట్లు ఆమెకు స్పర్శ కలిగింది. ఆమె అది స్వప్నస్థితిగానే భావించింది. గర్భవతి అయ్యే దాకా ఆమెకు విషయం అర్థం కాలేదు. భీమేశ్వరుని కరుణాకటాక్షాల వలన గర్భవతి అయిన మాచెమ్మకు నవమాసాలు నిండాయి. 11 శతాబ్ధమున, ప్రభవనామ సంవసత్సరము, శ్రావణశుక్లపంచమి రోజు శుక్రవారమునాడు, ఒక శుభముహూర్తాన  కుమారునికి జన్మనిచ్చింది. ఆమె బాలుడి వైపు చూసినపుడు ఒక మహాజ్యోతిశ్చక్రము పరివేష్టమై చుట్టి హఠాత్తుగా మాయమైపోయింది. పసిబాలుని తలపై జటాభారము, గంగాజలము, చంద్రరేఖ కనిపించినట్లయ్యింది ఆమెకు. ఆపిల్లవాని కంఠము నుండి ఒక చిన్న నాగు తన్ను బుస్సుమంటూ తాకవచ్చినట్లనిపించింది. కనులను నులుముకొని చూసేసరికి అవేవియూ కానరాక నవ్వుతున్న పిల్లవాడు మాత్రమే కనపడ్డాడు.   భ్రమ ఏమిటో ఆమెకు ఏమీ అర్థం కాలేదు.


భీమకవి బాల్యము


పిల్లాడికి నాలుగేళ్ళప్రాయం వచ్చింది. “అమ్మా” అని పిలువడం మొదలుపెట్టాడు. భీమేశ్వరుని వరపుత్రుడు కావున ఆ బాలున్ని భీమన్నా”, “భీమేశ్వరా”అని పిలుస్తూ మాచెమ్మ ఎంతో గారాభముగా పెంచసాగింది. భీమన్నకు నామకరణమహోత్సవంచేయడానికి ఎవరూ ముందుకురాలేదు. తప్పటడుగులు వేసే వయసు గడిచింది.
        ఊరి వారంతా భీమేశ్వరుని వరం వల్లపుట్టిన బాలుడీ భీమన్న అన్న సత్యాన్ని అర్థం చేసుకోలేక,విధవ బిడ్డకు జన్మనిచ్చిందని భావించారు.అందరూఒక్కటై మాచెమ్మను ఊరి నుంచి వెలివేశారు. ఏతప్పూ చేయని మాచెమ్మ ఎవరి మాటలను పట్టించుకోకుండా,పరమేశ్వరుని మీద భారం వేసి, ధైర్యంగా, అన్నీ తానైభీమన్నకు ఏ లోటు రాకుండా చూసుకొనేది. సాధ్యమైనంత వరకూ లోకపు దృష్టిని తప్పిస్తూపెంచసాగింది.గురుకుల పాఠశాలకు పంపి విద్యాభ్యాసము చేయించలేకున్నా,మాచెమ్మ భీమన్నకుశ్రీరాముని ధర్మనిష్ఠ, కుమారస్వామి విక్రమము, పరమశివుని భక్తవాత్సల్యము, శ్రీకృష్ణ పరమాత్ముని రాజనీతి, నలదమయంతుల కష్టదశ మొదలైన పురాణవృత్తాంతాలనుచెబుతూ పెంచింది.భీమన్న మేదస్సు దేనినయినా శరవేగముగా గ్రహించేది.
        ఆటలాడునపుడు తన తోటిబాలలు చుట్టూ చేరి భీమన్ననుపరిహాసంచేయడం, తన తల్లిని వెలివేయడం, ఊరిలో ఏ విశేషం జరిగినా తమను మాత్రం పిలవకపోవడంపసివాడైన భీమన్నకుపెద్దగా అర్థమయ్యేవి కావు. తమ ఇంటికి ఎవ్వరూ వచ్చేవారు కారు. ఇవన్నీ గమనించి విచారించేవారు.రోజులు గడిచే కొద్ది నిదానంగా లోకజ్ఞానం సంపాదిస్తూ, భీమన్న పదహారేళ్ళప్రాయంవాడయ్యారు.తండ్రి మరణం తర్వాత తాను పుట్టడం వల్ల తన తల్లిని నిందిస్తున్నారనీ, తననుపరిహాసం చేస్తున్నారనితెలుసుకున్న భీమన్న,ఎంతో ఆవేశంతో తన తల్లినే జరిగిన సంగతి అడుగుదామని ఇంటికి వచ్చారు.రాయెత్తి తన తల్లితో అమ్మ అందరూ నన్ను గోళకుడని నిందిస్తున్నారు. అది నిజమేనా? నా తండ్రి ఎవరో చెప్పవా?. నిజమేమిటో తెలియజేయవా? లేకుంటే ఈ రాయితో నీ బుర్ర పగులగొట్టమంటావా?“అని నిలదీసాడు. అందుకు మాచెమ్మ బిడ్డా! అంత కోపం ఎందుకు నయనా. నేను నిజం చెప్పినా నువ్వు నమ్మి ఈ ఊరివారిని నమ్మించగలవా?లేదు కదా?తిన్నగా ద్రాక్షారామానికి పోయి, అక్కడ భీమేశ్వరున్నిదర్శించి,శివలింగమును కౌగిలించుకొని ఇదే ప్రశ్ననుఅడుగు. ఆ భీమేశ్వరుడే నీకు అంతా చెబుతాడు. అలాఆయన పలుకకపోతే నా మీదకు రాయి ఎత్తి అడిగిన విధంగానే తనను కూడా అడుగు. నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానము లభిస్తుంది.” అని చెప్పింది.
            భీమన్న రాయి పారేసి తల్లి పాదాలకు నమస్కరించి, భోజనం కూడా చేయకుండా తక్షణం ద్రాక్షారామముబయలుదేరారు. దారి పొడువునా భీమేశ్వరుని ధ్యానము చేసుకుంటూ ద్రాక్షారామము చేరారు. అక్కడ భీమేశ్వరున్ని దర్శించి, లింగమును కౌగిలించుకొని పరిపరి విధములగా స్తోత్రము చేస్తూ,తన తండ్రి ఎవరో నిజం చెప్పమని వేడుకున్నారు. ఎంత వేడుకున్నా పరమేశ్వరుడు పలుకకపోవడంతో భీమన్న మనసులో ఆవేదన అధికమయ్యింది. ఎలాగైనా పరమేశ్వరు నుంచి సమాధానంతోనే తిరిగి వెళ్ళాలని సంకల్పించుకున్న భీమన్న,  తన తల్లి మాట ప్రకారంభీమేశ్వరా!నాకు సమాధానం చెబుతావా? లేక పలుకలేని నీమూగ పాశాన లింగమును ఈ రాయితో పగులగొట్టి, అదే రాయితో కబుర్లు చప్పిన నా తల్లి తలనుపగులగొట్టమంటావా?” అని రాయెత్తి భీమేశ్వరునిలింగముపై వేయబోయారు. వెంటనే పరమేశ్వరుడు ఫ్రత్యక్షమయ్యి భీమన్నను ఆపి పుత్రవాత్సల్యముతో చేరదీసి, కుమారా! నువ్వు నీ తండ్రి మరణించిన తర్వాత నా అనుగ్రహము వలన, నా అంశతో జన్మించినావు. కావున నువ్వు నా తనయుడవే. నీ తల్లి మహాభక్తురాలు. ఆమె పుత్రలాభమును కోరింది. నిష్కల్మషమైన భక్తురాలు కోరిన కోరికను తీర్చడం కోసము నిన్ను అనుగ్రహించాను” అని భీమేశ్వరుడు పలికాడు.
        భీమన్న “తండ్రీ! నేను నీ కుమారుడనైతే, నన్ను అందరూ ఎందుకు నిందిస్తున్నారు?” అని అడుగగా,బోళాశంకరుడు “లోకులు నన్ను పూజిస్తారే గానీ నా మీద పరిపూర్ణమైన విశ్వాసంతో కాదు. నేను వారి అవసరాలు తీర్చుట కోసము. వారి అవసరాలను తీరుస్తాను అన్న విశ్వాసము వారిలో ఉంది కానీ, ఆది సంపూర్ణమైనది కాదు. అందువల్ల వారు నా లీలలను నమ్మలేకపోతున్నారు.వారు భగవంతుడు ఒక వితంతువుకు కూడా కుమారున్ని ఇవ్వగల శక్తిస్వరూపుడని విశ్వసించలేనిఅజ్ఞానాంధకారులవడం వలన నిన్నూ, నీ తల్లినినిందించి వెలివేసారు.నీకు ఉపనయనం చేసి, విద్యాభ్యాసము చేయడానికి ఎవరూ సిద్ధపడలేదు కావున,  తండ్రిగా ఈ బాధ్యతను నేనే నెరవేరుస్తాను” అని చెప్పి భీమన్నను నాలుక చాచమన్నాడు. పరమేశ్వరుడు భీమన్న నాలుక మీద వాగ్భామినీ బీజాక్షరాలను లిఖించి“నా తనయుడవైన నీవు, సకలశాస్త్రపారంగతుడవు.సకల భాషావేదివి. ఇక దేశయాటనముచేస్తూ నానా రాజసభలందు అనర్గళమైన, కవిత్వం చెబుతూవర్ధిల్లెదవు.నేటి నుంచి పశుపక్షిమృగాలు సకలప్రాణికోటి నీ మాటకు లోబడుతాయి. జీవులను పుట్టింప, గిట్టింప శక్తి కలదు నీకు. నేటి నుంచి నీవు ఏది పలికినా,అది జరుగుతుంది.నీ మాటకిక తిరుగుండదు.నువ్వు ఆడింది ఆట, పాడింది పాట.సంఘమున ఎంతటి వారైననూ నీ మాటకు లోబడవలసినదే.అని వరం ప్రసాదించి మాయమయ్యాడు.భీమన్న తాను స్వయానా పరమేశ్వరుని కుమారుడని తెలిసి మహదానందముతో వేములవాడకు బయలుదేరారు.
        భీమేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళిన భీమన్న ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో మాచెమ్మకంగారుపడుతూ “భీమన్న మొండి పట్టుదల కలవాడే. దారిలోఏ ఇబ్బందీ కలుగలేదు కదా? నా చిట్టితండ్రి మార్గము తెలిసి క్షేమముగా వెళ్ళాడా? భీమేశ్వరుడు దర్శనమిచ్చుంటాడా?” అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, భీమేశ్వరుని మీద భారం వేసింది.“సర్వేశ్వరా! ధీనబంధూ! పరమేశా! శతకోటి వందనాలు. నా కుమారుని నా వద్దకు క్షేమంగా పంపుమని” వేడుకొనసాగింది. ఇంటికి చేరిన భీమన్నను చూడగానే,మాచెమ్మకు పట్టరాని సంతోషం కల్గింది. వచ్చీరాగానే అమ్మకు పాదాభివందనం చేసి “అమ్మా నా మాటలతో నీ మనసును నొప్పించినందుకు నన్ను క్షమించు” అని వేడుకొని, ద్రాక్షారామ విశేషాలన్నిటినీ వివరించారు.



        వేములవాడ భీమకవి సంస్కృతంలో  రచించిన జ్యోతిష్య  గ్రంథమును తెలుగులో అనువదిస్తూ, ఒక కవి భీమకవి జన్మవృత్తాంతాన్ని ఈ సీసపద్యంలో వివరించారు.


సీ. శ్రీకరంబై ధరఁ జెలువుఁగాంచినయట్టి                        వెసఁజని యాతని వ్రేయనుంకించిన
     భీమపురంబునఁ బ్రేమమీఱ                                      భీమేశ్వరుడుదయ పెద్దగలిగి
భీమేశ్వరుండునుఁ బ్రియముతో భక్తుల                        ప్రత్యక్షమైవత్స! రమ్మని తగఁజేరి
     కోర్కులొసంగుచుఁ గొమరు మిగుల                             పశుపక్షి మృగములఁ బ్రాణికోట్ల
నొకనాఁడు తత్ఫురి యువతులుఁగొందఱు               గలిగించు శక్తియుఁ గరమొప్ప జనులకు
     భక్తి భీమేశ్వరు ‌భవనమునకుఁ                                  బిడ్డల నాయువుఁ బెంపుదనర     
బోయి పుత్రులవేడ ముగ్ధత్వమున నొక్క              సంపదలొసగెడు సామర్థ్యమునునిడి
     విధవ కుమారుని వేడ్కఁగోర                                    కానిది యౌనని యైనదెల్ల
నాలేమ ముగ్ధత కపహసించుచు నల                  గాదనినట్టులఁగావించు బలమును
     భీమేశ్వరుడు  పుత్రుఁ బ్రీతి నొసఁగ                            మునురాఁ గలుగునదియునుఁ దెలుపఁగఁ
నా కాంత గర్భిణియై కాంచెఁ దనయునిఁ                 బ్రావీణ్యమునునిచ్చి ప్రబలుము నీవని
      గలియుగాదిని బ్రేమ గడలు కొనగఁ                         వరమిచ్చెఁ బదియాఱు వర్షములకు     
బ్రభవ వర్షంబున శ్రావణమాసంపు                           నాతనికి సహాయమై సరస్వతియును
      శుక్లపక్షంబున శోభనంబు                                                                  ********
మీఱఁ బంచమి శుక్రవారంబునను హస్త                     నతడెట్లు చెప్పిననట్ల చేయుచునుండె  
      యందుఁ గన్యాలగ్నమందువెలయ                            సరిలేని కీర్తిచే జగతి వెలసి                
వెలివెట్టి రక్కాంత విధవయై పుత్రుని                    యతడు చెప్పిన శాస్త్రమందధిక భక్తి  
  గాంచెనటంచును  గడమజనము                         కలిగి నిజమని తలచిన గలుగుశుభము    
లంతఁదత్తనయుండు నైదేండ్ల బాలుడై                      కోర్కెలెల్లను ఫలియించు గురుతరముగ
    పురి బాలకుల తోడఁ బొసగనాడ                         సకల జనులకు దప్పదు జగతిలోన
జనులెల్ల గోళకుండని నిందఁజెసిన
      రోషించి యాతండు దూషితయని
ఱాయెత్తి తన తల్లి నేయఁ బోయిన యది
      భీమేశ్వరుడు తండ్రి వ్రేయమనిన                             

బ్రాహ్మణ - సంతర్పణ

తమను బహిష్కరించిన సంఘమును, తానే బహిష్కరించినవాడిలా, భీమన్న నాటి నుంచి ఊరి బాలలతో ఆటలు మాని, వివిధ గ్రంథాలను చదువుతూ పెరిగి పెద్దవాడయ్యారు.

          తల్లి ప్రథమపూజ్యురాలు. తల్లి మీద నిందలు మొపితే ఎంతటి వారికైనా భరింపతరమా?ఎంతో ఆత్మాభిమానం కలిగిన భీమన్న ఊరుకుంటారా?పరమేశ్వరుని వరమునందుకున్న తర్వాత భీమన్న చేసిన మొదటి పని తన తల్లిపై మోపిన అపవాదునుతొలగించి,అందరికళ్ళు తెరిపించడం. ఒకనాడు వేములవాడలో ఒక బ్రాహ్మణుని ఇంటిలో సంతర్పణ జరుగుతోంది. ఆ ఇంటి యజమాని అందరినీ ఆహ్వానించాడు, కానీ భీమన్నను మాత్రం ఆహ్వానించలేదు. భీమన్న పిలవకపోయినా సంతర్పణకు వెళ్ళారు. నేరుగా లోపలికి వెళ్ళి కూర్చొని,తనకు కూడా భోజనం వడ్డించమని అడిగారు. అక్కడి వారంతా భీమన్నను బయటకి పంపివేసి, నీవు లోనికి రావద్దని చెబుతూ తలుపులు వేసేశారు. బాలభీమన్న“భీమేశ్వరుని తనయుడనైన నన్ను విస్మరించి మీరు ఈ పూటభోజనం చేయలేరు”అని చెప్పి బయట అరుగుపై కూర్చొన్నారు.లోపల జరుగుతున్న తంతు అంతటినీ గమనిస్తూ వడ్డన ప్రారంభమయ్యేంత వరకు ప్రశాంతంగా ఉన్నారు. వడ్డన పూర్తీ అయిన వెంటనే ఈ క్రింది పద్యంచెప్పారు.  

    ఉ. “గొప్పలు సెప్పుకొంచు ననుఁ గూటికి బంక్తికి రాకుమంచునీ 
          ద్రిప్పుడు బాపలందఱునుఁ దిట్టిరిఁ గావున నొక్కమాఱమీ 
          యప్పములన్ని కప్పలయి యన్నము సున్నముఁ గాగ మాఱుచున్ 
          బప్పును శాకముల్ పులుసు బచ్చడులుఁ జిఱురాలుగావుతన్”

భావము:తాము (సత్బ్రాహ్మణులమని)గొప్పలు చెప్పుకుంటూ, నన్ను భోజనమునకు రావద్దని ఈ బ్రాహ్మణులందరూ తిట్టారు. కావున ఒకసారి మీ అప్పడాలన్నీ కప్పలుగా,అన్నము అంతా సున్నముగా మారి, పప్పు,కూరలు,పులుసు, పచ్చడులు చిన్నచిన్న రాళ్ళుగా అవ్వుగాక!
          తక్షణమే వడ్డింపబడిన అన్నమంతా సున్నముగా మారింది. అప్పడాలన్నీ కప్పలై బెకబెక మంటూ గెంతుతూ, అటూ ఇటూ వెళ్తున్నాయి.పప్పు, పులుసు, పచ్చడి అన్ని చిన్నచిన్న రాళ్ళుగా మారిపోయాయి. ఈ వింత మార్పును చూసి భోజనపంక్తికి కూర్చున్న బాపలందరూ చాలా కలవరపడ్డారు. సంతర్పణ చేయిస్తున్న ఇంటి యజమాని అందరినీ  చూసి కలవరపడవద్దని చెప్పి,మళ్ళీ వడ్డించడానికి క్రొత్త విస్తరులను వేయించాడు. తీరా  అన్నపురాశి వద్దకు వెళ్ళి చూసేసరికిఅక్కడ కూడా అన్నమంతా సున్నంగా మారిపోయి ఉంది. గంపలోని అప్పడాలేమో కప్పలయ్యి బయటకు ఎగురుతూ గెంతులేస్తున్నాయి. మిగితా వంటలన్నీరాళ్ళుగా మారిపోయి ఉన్నాయి. ఆ ఇంటి యజమానికి ఎందుకిలా జరిగింది? ఏమి చేయాలి? అనిదిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అంతలో అక్కడి వారిలో భీమన్న చెప్పిన పద్యం విన్న ఒక బ్రాహ్మణుడు,ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్ళి ఆరుబయట కుర్చుని భీమన్ననే ఇవన్నీ ఇలా మారాలని పద్యం చెప్పాడనీ, ఇదంతాఆ భీమన పలుకులమూలంగానే జరిగిందనీచెప్పాడు. అప్పుడు తెలిసింది ఆ యజమానికి “నన్ను విస్మరించి మీరు ఈ పూట భోజనం చేయలేర”ని చెప్పిన భీమన్న మాటలకర్థం. 
        అతను వెంటనేభోజనానికి వచ్చిన బ్రహ్మణులందరినీభీమకవి వద్దకు పిలుచుకొని వెళ్ళి,వాటినితిరిగి భోజనపదార్థాలుగా మార్చమని అడిగాడు. అలా చేసినట్లయితే భోజనానికి రానిస్తామనిచెప్పారు. వారికి భీమకవి అంతరార్థం ఇంకా అర్థం కాలేదు. భీమకవి“మీరందరూ గొప్పజాతి వారే కదా! మరి మీరే మార్చుకొవచ్చుగా. నేను మీ అంతటి వాన్ని కాదు కదా! నా వలన ఏమవుతుంది? చెప్పండి?“ అని అడిగాడు.ఆ బ్రహ్మణుల కన్నులు తెరచుకున్నాయి. వెంటనే వారు "భీమన్నా! మేముతప్పుగా ప్రవర్తించాము. నువ్వు మహానుభావుడివి. నిన్ను భోజనానికి రానివ్వకుండడం మా అందరి అపరాధము. మమ్మల్ని అనుగ్రహించి యథాప్రకారము వాటిని భోజనసముదాయముగా మార్చండి. అంతేకాకమీరు కూడా మాతో పాటి భోజనానికి కూర్చొని మమ్ము కృతార్థులను చేయండి. ఇప్పటి నుంచిమీతోగౌరవాభిమానాలతో నడుచుకుంటాము” అని నమస్కరిస్తూ వేడుకున్నారు. భీమకవి తిరిగి ఇంకో పద్యం చెప్పారు.


          మ.     "ఘనుడౌ వేములవాడ వంశజుడు ద్రాక్షారామ భీమేశనం 
                   దనుఁడీ భీమన యంచు గుర్తెఱింగి, నిందల్ మానినన్ గౌరవం 
                   బుననీ విప్రులుఁజూచిరందువలనఁబూర్వస్థితిన్ జెంది భో 
                   జన వస్తు ప్రకరంబులన్నియు యథాస్వస్థంబు లౌగావుతాన్"

భావం:ఈ బ్రాహ్మణులందరూ, గొప్పవాడు, వేములవాడ వంశస్థుడు, ద్రాక్షారామ భీమేశ్వరుని తనయుడీ భీమన అని తెలుసుకొని, నిందించడం మాని,ననుగౌరవంతో చూసారు. అందువలన ఈ భోజన, వస్తుసముదాయమంతా కూడా మునుపటి రూపుపొంది వాటిపూర్వస్థానానికి వచ్చును గాక!

          వెంటనే మునుపటిలా అన్నపురాశి ప్రకాశించింది. కప్పలన్నీ తిరిగి అప్పడాలుగా మారిపోయాయి. చిన్నచిన్న రాళ్ళన్నీ తిరిగి పప్పు, పులుసు, పచ్చడులుగా మారిపోయాయి. విస్తరులన్నీ తిరిగి భోజనంతో నిండిపోయాయి. ఇది చూసిన ఆ బాపలంతా భీమకవి మహత్యానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. వెంటనే భీమకవిని తమతోపాటి భోజనానికి తీసుకుపోయి భోజనవరుసలో అగ్రస్థానాన కుర్చోబెట్టి గౌరవించారు. ఊరివారంతా ఈ భీమన్నద్రాక్షారామభీమేశ్వరుని వరపుత్రుడని తెలుసుకొని మసలుకున్నారు. ఇన్ని రోజులు నిందలు మోపి, వెలివేసి బాధ పెట్టినందుకుతమను మన్నించాల్సిందిగా మాచెమ్మను వేడుకున్నారు. నాటి నుంచి వారిపట్ల గౌరవాభిమానాలతో నడుచుకున్నారు.

       
నాటినుండి భీమన్న అద్భుతమైన కవిత్వము చెబుతూ“వేములవాడ భీమకవి”గా లోకప్రసిద్ధుడయారు. భీమకవికి కవిత్వము అమోఘముగా హిమాలయాల నుండి ప్రవహించే భగీరతుడిలా(గంగానదిలా) ప్రవహించేది. శబ్ధార్థములు ఊట బావులవలే పెనవైచికొని ఈ మహాకవి కంఠసీమ నుండి వెడలసాగెను. నాటి నుండి భీమకవికి కవిత్వమే జీవితమైనది. ఎట్టి కవిత్వమైనా చెప్పగలిగే వారు. అందరూ ఉద్దండకవి అని పిలిచేవారు. తాను రాజ సభలకు వెళ్ళినపుడు తాను ద్రాక్షారామభీమేశుని పుత్రుడనని చెప్పేవారు, అంతేకాదు పరమేశ్వరుని స్వభావాన్ని పునికి పుచ్చుకున్నారు. ఎలాగంటేభీమకవి పరమేశ్వరునిలా మహాకోపి. ఎవరైనా తన పట్ల తప్పుగా ప్రవర్తించినా, అవమానపరచినా, తన సంకల్పానికి అడ్డుపడినామహాకోపి అయ్యి శాపం పెట్టేవారు. కానీక్షమించంమని అడిగితే చాలు అంతటి ఆవేశంలోనూ కరుణాహృదయుడై, తన తండ్రిని మించిన తనయుడైశాపవిమోచనం కల్గించేవారు. అంతే కాక అప్పటి నుంచి వారిపై ఎల్లవేళలా అనుగహము కలిగి ఉండేవారు. శాపాన్ని పెట్టడమే కాక, తన శాపాన్ని సమూలంగా పటాపంచలు చేయగల శక్తి కూడా కలిగి ఉండడం వలన ఈయననుఅందరూ శాపానుగ్రహ(శాప+అనుగ్రహ) సమర్థుడని కీర్తించేవారు. 

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...