సింగన మాచనమంత్రి మీద అప్రతిహతంగా చెప్పిన ఆ అద్భుత పద్యాలను


సింగన మాచనమంత్రి

                మాచనమంత్రి నియోగి బ్రాహ్మణుడు. ఇతని తండ్రి పేరు సింగన. తల్లి పేరు లక్కమాంబ. ఇతడు రాజేంద్రచోడుని వద్ద మంత్రివర్యునిగా, దండినాధునిగా పని చేశాడు.  భీమకవి ఒకనాడు ఈతని ఇంటికి వెళ్ళారు. ఇతను భీమకవిని పలకరించలేదు. కారణము ఆ సమయంలో రాచకార్యవిషయముల గురించాలోచిస్తూ, లీనమైపోయి బయటి ప్రపంచమును పూర్తీగా మరచిపోయాడు. భీమకవి అతనిని చూసి ఈ క్రింది పద్యాలను చెప్పారు.
           
                                అప్రతిహతంగా చెప్పిన ఆ అద్భుత పద్యాలను విని మాచన మహదానందుడై భీమకవిని సత్కరించాడు. ఆ సత్కారములను గైకొన్న భీమకవి, అతని కళ్ళముందే ఆ ధనాన్నంతటినీ పేదవారికి పంచిపెట్టి “ధనమొకరి వద్ద శాశ్వతంగా నిలిచి ఉండదు. దానము చేయుట దాచుకొనుటయే. కావున ఇలా చేసాను. నీవు కూడా దానకర్ణుడవు కమ్ము“ అని హితోపదేశము చేశారు. ఆనాటి నుండి మాచన మంత్రి విద్వాంసులనూ, కవులనూ సత్కరిస్తూ, బీదవారికి మహాదానాలను చేస్తూ గడిపాడు.

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...