బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర
స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే పలుకుతాను అని వరమిచ్చారట. భీమలింగేశ్వరుని ‘తాతా’ అని పిలిచేవాడట. ఇతడు శ్రీమంతుల
ఇండ్లలో, పాలెగాల్ల ఇండ్లులో దాచిపెట్టిన ధాన్యాన్నిదోచి తాగడానికి గంజి, తినడానికి
గింజలు లేని బీదసాదలకు పంచేవాడట. బళ్లారి - అనంతపురం జిల్లాలు బ్రిటీషు వారి అధీనంలో ఉండగా బళ్లారి కచేరి దోచి బీదలకు పంచిపెట్టినాడట.
తను ఏపని చేయదలచినా ఎక్కడికి వెల్లదలచినా మొదట తాత గుడికి వచ్చి దర్శించుకొని విన్నవించుకొని
తాత సరే అని పలికితే వెల్లేవాడట. తాత అనుగ్రహం వల్ల తలపెట్టిన ప్రతి పనులలో ఎదురు లేకుండా
ఉండేదట.
కానీ చివరికి తన మరణం సమయంలో “తాత వెళ్ళవద్దు. ముప్పు ఉంది” అని చెప్పినా చెల్లి
కి కట్టుబడి చెల్లి ఇంటికి ఇంటికి వెల్లాడట. ఎన్నాళ్ళుగానో అవకాశం కోసం కాపు కాసిన
శత్రువుల పన్నాగానికి మోసానికి చిక్కి మరణించాడు.
నాగిరెడ్డి శూరత్వము గురించి, దానధర్మాల గురించి జానపదులు ఇప్పటికీ ఇలా పాడుకుంటారు.